'స్త్రీ యాత్రికులు'
యాత్రా సాహిత్యాన్ని ఒక ఉజ్వల భవిష్యత్తు వైపుగా ప్రయాణింప చేయటానికి,
స్త్రీలను కూడా యాత్రలు చేయమని ప్రోత్సహిస్తూ రాసిన పుస్తకం ఇది.
జ్ఞానాన్వేషణ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణాలు చేసినస్త్రీమూర్తుల సాహసోపేత జీవితాన్ని పరిచయం చెయ్యటం ఈ రచన ముఖ్యోద్దేశం .
యాత్రా స్వాతంత్ర్యాన్ని అనుభవించటానికి అందరూ ముందుకు రావాలనే ఆశయంతో
ప్రొఫెసర్ ఆదినారాయణ సమకూర్చిన రమణీయ మణిహారం ఈ 'స్త్రీ యాత్రికులు'.
ఈ పుస్తకాన్ని 'విహంగ' చదువరుల కోసం ధారావాహికగా అందిస్తున్నామని చెప్పటానికి సంతోషం గా వుంది.
ఈ పుస్తకం రచయిత 'డా.ఆదినారాయణ' ఆంధ్ర యూనివర్సిటీ,ఫైన్ఆర్ట్స్ డిపార్ట్ మెంట్ లో ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్నారు.
ఈయన జీవితమే ఒక యాత్ర.మామూలు యాత్ర కాదు.పాదయాత్ర. విశాఖ పట్టణం నుంచి డిల్లీ కి పాదయాత్ర చేసినా,
గుండ్లకమ్మ గట్టుని 'అడుగుల'తో కొలిచినా... ఆయనకే చెల్లింది. 'భ్రమణ కాంక్ష ,జిప్సీలు, మహా యాత్రికులు,స్త్రీ యాత్రికులు,
డెకోరేటివ్ ఆర్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ టెంపుల్స్' వీరి ఇతర రచనలు.
రచయిత మాట :